యాదాద్రి, నవంబర్ 29 : యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుతో మేము సైతం అంటూ భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం హైదరాబాద్కు చెందిన నవతేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు గుండ్ర యాదగిరి దంపతులు రూ.5,00,449, యాదగిరిగుట్టకు చెందిన సుడుగు జీవన్రెడ్డి రూ.1,00,116, యాదాద్రి ఆలయ ఉప ప్రధానార్చకుడు సురేంద్రాచార్యులు రూ.11,116 చెక్కులను ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. చరిత్రలో నిలిచిపోయే యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉన్నదని వారు పేర్కొన్నారు.