ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ వేలంలో పాల్గొన్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించారు. మెగా ఆక్షన్లో 590 మంది క్రికెటర్లు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరగనున్నది. 590 మందిలో 228 మంది క్యాప్డ్ కాగా, 355 మంది అనామక ఆటగాళ్లు ఉన్నారు. ఏడు మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, షమీ, ఇశాంత్ కిషన్, రహానే, రైనా, చాహల్, సుందర్, శార్దూల్, దీపక్ చాహర్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొంటున్నారు. పది ఐపీఎల్ జట్లు ఈ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. రిజర్వ్ ప్రైస్ రెండు కోట్ల రేంజ్లో 48 మంది ఆటగాళ్లు ఉన్నారు. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైజ్లో 20 మంది ఉన్నారు. కోటి ప్రైస్లో మరో 34 మంది ఉన్నట్లు తెలుస్తోంది.