న్యూఢిల్లీ, జూలై 31: మదింపు సంవత్సరం 2026-27కుగాను ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లు దాఖలు చేశారు. గురువారం 42 లక్షల మంది దాఖలు చేశారని ఐటీ శాఖ ఎక్స్లో పేర్కొంది.
2026-27 అసెస్మెంట్ ఏడాదికిగాను ఐటీఆర్-1, ఐటీఆర్-2 తుది గడువు శుక్రవారం(జూలై 31తో) ముగియడంతో అత్యధిక మంది వ్యక్తిగతంగాను, చిన్న, మధ్యతరహా పన్నుచెల్లింపుదారులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు.