కాగజ్నగర్: కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో (Sirpur paper mill) ప్రమాదం జరిగింది. పేపర్ మిల్లులోని ట్రాన్స్ఫార్మర్ (Transformer) పేలడంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు వారిని వెంటనే కాగజ్నగర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ బొగ్గుగనిలో నిన్న పైకప్పు కూలి నలుగురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఎస్సార్సీ 3 గనిలో పైకప్పు కూలింది. దీంతో పైకప్పు సపోర్టు పనిచేస్తున్న టింబర్మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్మెన్ వీ కృష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహరాజు, చంద్రశేఖర్ మృతిచెందారు. ఇంకా ఆఘటన మరవక ముందే సిర్పూర్ పేపర్ మిల్లులో ట్రాన్స్ఫార్మర్ పేలి నలుగురు కార్మికులు గాయపడటం గమనార్హం.