హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,102 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 359 మంది బాధితులు కోలుకోగా.. వైరస్తో ఇద్దరు మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716కు పెరగ్గా.. ఇప్పటి వరకు 6,47,953 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 3,872 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.51 శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉన్నది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచి 72, కరీంనగర్లో 42, నల్లగొండలో 25, హన్మకొండలో 25 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.