హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,62,526కు చేరింది. కొత్తగా 280 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్తో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు 6,53,302 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 3,899 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో రికవరీ రేటు 98.60శాతం, మరణాలు రేటు 0.58శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ ఒకే రోజు 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 79 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 24, కరీంనగర్లో 22, నల్గొండలో 19, రంగారెడ్డిలో 18 మంది వైరస్కు పాజిటివ్గా తేలారు.