ప్రజాదరణ దేశాధినేతల జాబితాప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతలపై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ఫలితాలను జనవరి 21న విడుదల చేసింది. దీనిలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ 71 శాతం ప్రజాదరణతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ (66 శాతం) 2, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ (60 శాతం) 3, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (48 శాతం) 4, జర్మనీ చాన్స్లర్ ఒలఫ్ స్కోల్జ్ (44 శాతం) 5, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (43 శాతం) 6వ స్థానాల్లో నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్ డ్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 7, 8 స్థానాల్లో ఉన్నారు.
ఉత్తర కొరియా
రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా జనవరి 17న ప్రయోగించింది. వీటిలో ఒకటి రైలు నుంచి ప్రయోగించింది. మరో టాక్టికల్ గైడెడ్ మిసైల్ తూర్పు తీరంలోని లక్ష్యాలను ఛేదించింది.
దావోస్ ఎజెండా-2022
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ ఎజెండా-2022 సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనవరి 17న నిర్వహించారు. కరోనా సమయంలో ‘ఒకే భూమి-ఒకే ఆరోగ్యం’ అనే విజన్ను అనుసరించి అవసరమైన మందులు, వ్యాక్సిన్లను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ అన్నారు. 2021, డిసెంబర్ 31 వరకు 1154.173 లక్షల డోసుల వ్యాక్సిన్ను 97 దేశాలకు పంపిణీ చేసిందన్నారు.
మాధేశ్ ప్రదేశ్
భారత్ సరిహద్దులో ఆగ్నేయంగా ఉన్న ప్రావిన్స్-2కు మాధేశ్ ప్రదేశ్ అని పేరు పెట్టినట్లు నేపాల్ జనవరి 18న ప్రకటించింది. ఇందుకు ప్రొవిన్షియల్ అసెంబ్లీ మూడింట రెండొంతల ఓట్ల ఆధిక్యంతో ఆమోదం పొందిందని వెల్లడించింది. దీనికి జనక్పూర్ను రాజధానిగా చేశారు.
మారిషస్లో ప్రాజెక్టుల ప్రారంభం
మారిషస్లో భారత్ సహకారంతో నిర్మించిన ప్రాజెక్టులను ఆ దేశ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్తో కలిసి మోదీ వర్చువల్గా జనవరి 20న ప్రారంభించారు. వీటిలో హౌసింగ్ ప్రాజెక్టు, 8 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, సివిల్ సర్వీసెస్ కాలేజీ తదితరాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య సముద్రాల భద్రత, వివిధ రంగాల్లో సహకారం కోసం ‘సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇది ది రీజియన్)’ విజన్ను అమల్లోకి తీసుకొచ్చారు.
భారత్-రష్యా
అరేబియా సముద్రంలో భారత్, రష్యా నౌకా దళాలకు చెందిన యుద్ధనౌకలు జనవరి 16న విన్యాసాలు నిర్వహించాయి. భారత్కు చెందిన ఐఎన్ఎస్ కోచి (గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్), రష్యాకు చెందిన అడ్మిరల్ ట్రిబ్యూట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం సహకారం, సమన్వయం, ఉమ్మడిగా సాగడం కోసం ఈ విన్యాసాలు నిర్వహించారు.
వార్తల్లో వ్యక్తులు
షేలిన్ ఫోర్డ్
మిసెస్ వరల్డ్-2022 విజేతగా అమెరికాకు చెందిన షేలిన్ ఫోర్డ్ విజేతగా నిలిచింది. జనవరి 15న జరిగిన పోటీల్లో 57 మందిని ఓడించి కిరీటాన్ని దక్కించుకుంది. అమెరికా ఓహియోలోని గ్రాన్విల్లేకు చెందిన షేలిన్ ఒక చారిటబుల్ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తుంది. ఈ టైటిల్ అమెరికాకు దక్కడం ఇది ఎనిమిదోసారి.
బిర్జు మహరాజ్
ప్రముఖ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బిర్జూ మహరాజ్ జనవరి 17న మరణించారు. ఈయన కథక్ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసి కథక్ చక్రవర్తిగా పేరుగాంచారు.
విజయ్ శేఖర్ శర్మ
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ సంస్థకు అంబాసిడర్గా జనవరి 18న ఎంపికయ్యారు. ఈ సంస్థ స్థిరమైన, సురక్షితమైన, ఏకీకృత గ్లోబల్ ఇంటర్నెట్ను నిర్ధారిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.
విక్రమ్ దేవ్ దత్
ఎయిర్ ఇండియా నూతన సీఎండీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్ను కేంద్రం జనవరి 18న నియమించింది. 1993 బ్యాచ్ అధికారి అయిన ఈయన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్ అధికారిగా విధులు నిర్వహించారు.
శశాంక్ గోయల్
కేంద్ర కార్మిక శాఖ అడిషనల్ సెక్రటరీగా శశాంక్ గోయల్ను కేంద్రం జనవరి 18 నియమించింది. ఆయన 1990 బ్యాచ్ తెలంగాణ ఐఏఎస్ అధికారి. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయనను కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు.
డె లా ఫ్యుయెంటె
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన సటుర్నినో డె లా ఫ్యెయెంటె గార్సియా జనవరి 18న మరణించారు. మరణించే నాటికి ఈయన వయస్సు 112 ఏండ్ల 341 రోజులు. ఆయన స్పెయిన్లోని లియోన్లో జన్మించారు.
చంచల్ కుమార్
నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్)కు ఎండీగా చంచల్ కుమార్ జనవరి 19న నియమితులయ్యారు. 1992 బీహార్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఈయన.
జాహ్నవి దంగేటి
అమెరికాలోని అలబామాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను జాహ్నవి దంగేటి జనవరి 21న పూర్తిచేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈమె ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు.
జాతీయం
అమర్ జవాన్ జ్యోతి
ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో జనవరి 21న కలిపివేశారు. 50 ఏండ్లు నిర్విరామంగా వెలిగిన అమర్ జవాన్ జ్యోతికి స్థాన చలనం కల్పించారు. 1971లో భారత్-పాక్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు నివాళిగా ఈ జ్యోతిని నిర్మించారు. 1972, జనవరి 26న ఇందిరాగాంధీ ఈ అమర్ జవాన్ జ్యోతిని ప్రారంభించారు.
ఒడిశా-యూఎన్వో
చిన్న రైతుల ఆహార భద్రతను పెంపొందించడానికి ఒడిశా, యూఎన్వో ఆహార కార్యక్రమం కింద ఒప్పందాన్ని జనవరి 19న అంగీకరించాయి. భాగస్వామ్య ప్రయోగాత్మక చొరవ, వాతావరణ మార్పుల ప్రభావానికి అనుగుణంగా చిన్న కమతాలు కలిగిన రైతులను ఆదుకునేందుకు వాతావరణ సలహాలు రూపొందిస్తారు. ఒడిశాలోని 90 శాతం వ్యవసాయ సంఘాలను కలిగి ఉన్న చిన్నకారు రైతులు తమ ఆహారభద్రత, ఆదాయాన్ని మెరుగుపర్చడం కోసం ఈ ఒప్పందం జరిగింది.
త్రిపుర, మణిపూర్, మేఘాలయ
ఈశాన్య రాష్ర్టాలైన త్రిపుర, మణిపూర్, మేఘాలయ జనవరి 21న ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల జాబితాలో ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఐఐపీఈ వార్షికోత్సవం
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి వార్షిక వేడుకలను జనవరి 21న నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
క్రీడలు
ఇండియా ఓపెన్
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ జనవరి 16న జరిగిన ఫైనల్ పోటీలో భారత ఆటగాడు లక్ష్యసేన్ కీన్ యూ (సింగపూర్)ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు.
మహిళల సింగిల్స్లో బుసాసన్ (థాయిలాండ్) సుపనిద (థాయిలాండ్)పై గెలిచింది.
డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఎహసాన్-సెతియవన్ (ఇండోనేషియా) జోడీపై విజయం సాధించింది.
ైక్లెవ్ లాయిడ్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ైక్లెవ్ లాయిడ్ నైట్హుడ్ను జనవరి 16న స్వీకరించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్రిటన్ రెండో అత్యున్నత అవార్డు అయిన ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అందుకున్నాడు.
ఐర్లాండ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా జనవరి 17న చివరిదైన మూడో వన్డేలో ఐర్లాండ్ గెలిచింది. దీంతో 2-1తో ఐర్లాండ్ జట్టు సిరీస్ను చేజిక్కించుకుంది. విదేశీ గడ్డపై సిరీస్ గెలవడం ఐర్లాండ్కు ఇదే తొలిసారి.
సానియా మీర్జా
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా 2022 సీజన్ అనంతరం టెన్నిస్కు వీడ్కోలు పలకనున్నట్లు జనవరి 18న ప్రకటించింది. సానియా 6 గ్రాండ్స్లామ్లు, 3 మహిళల డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్ను గెలుచుకుంది. పద్మశ్రీ, అర్జున, రాజీవ్ ఖేల్త్న్ర అవార్డులను అందుకుంది.
రాహుల్, హార్దిక్
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజిలకు కెప్టెన్లను జనవరి 21న ఎన్నుకున్నారు. లఖ్నవుకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
–వేముల సైదులు జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్