దర్శకుడు మారుతి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అరంగేట్రం చేస్తూ రూపొందిస్తున్న వెబ్సిరీస్ ‘త్రీ రోజెస్’. ఎస్.కె.ఎన్.నిర్మాత. ‘ఆహా’ ఓటీటీలోత్వరలో విడుదలకానుంది. ‘రీతూ, ఇందు, జాన్వీ అనే ముగ్గురమ్మాయిల కథ ఇది. ఆధునిక భావాలు కలిగిన వారు స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవితాన్ని గడుపుతుంటారు. అనవసరపు కట్టుబాట్లు, బాధ్యతలు అంటే విముఖత ప్రదర్శిస్తుంటారు. తమ మనసుకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకునే వారి జీవితాల్లో జరిగే సంఘటనల సమాహారమే ఈ వెబ్సిరీస్ కథాంశం’ అని మారుతి తెలిపారు. ఇషారెబ్బా, పాయల్రాజ్పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్సిరీస్ టీజర్ను శనివారం కథానాయిక నిధి అగర్వాల్ విడుదల చేశారు. వినోదం, రొమాన్స్ అంశాలతో ఈ సిరీస్ అందరిని ఆకట్టుకుంటుందని కథానాయికలు తెలిపారు.