బెంగళూరు: సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. సింగిల్స్లో ప్రజ్నేజ్ గుణేశ్వరన్ మినహా మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి మూడు జోడీలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. టాప్ సీడ్ పూరవ్ రాజా-జీవన్ నెడుంచెళియన్ జంట 6-4, 6-7 (2/7), 10-8తో బొర్నా గోజో (క్రొయేషియా)-దిమితర్ కుజ్మనో (బల్గేరియా) ద్వయంపై విజయం సాధించింది. మరో ప్రిక్వార్టర్స్లో తెలుగు ఆటగాడు సాకేత్ మైనేనీ-రామ్కుమార్ రామనాథన్ జంట 6-3, 6-3తో మార్కోస్ కలొవెలోనిస్ (గ్రీస్)-తోషిడే ముసూ (జపాన్) ద్వయాన్ని చిత్తుచేసింది. శ్రీరామ్ బాలాజీ-విష్ణు వర్ధన్ జోడీ కూడా క్వార్టర్స్కు అర్హత సాధించింది.