హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల (ఏప్రిల్-సెప్టెంబర్) కాలానికి రాష్ట్రంలోని పట్టణాల్లో రూ.245 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2021-22లో జీహెచ్ఎంసీ మినహా 141 పట్టణాల్లో 21.04 లక్షల ఆస్తుల ద్వారా మొత్తం రూ.842.45 కోట్ల పన్ను వసూలు కావా ల్సి ఉండగా.. సెప్టెంబర్ నెలాఖరునాటికి రూ.244.78 కోట్లు వసూలయ్యాయి. తొలి త్రైమాసికంలో ఆస్తి పన్ను వసూళ్లపై కరోనా, లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రెండో త్రైమాసింలో పన్ను వసూళ్లు కొంత మేరకు పుంజుకున్నాయి. ఆస్తి పన్ను చెల్లింపుల్లో బొల్లారం, సిద్దిపేట మున్సిపాలిటీలు ముందున్నాయి. వర్ధన్నపేట, బోధన్, నకిరేకల్, నర్సాపూర్, తొర్రూరు, ఎల్లారెడ్డి, వడ్డేపల్లిలో అతి తక్కువ ఆస్తి పన్ను వసూలైంది. కార్పొరేషన్ల పరం గా చూస్తే వరంగల్లో అత్యధికంగా రూ.23.89 కోట్లు వసూలైంది. తర్వాత నిజాంపేట (రూ.13.73 కోట్లు), నిజామాబాద్ (రూ.12.99 కోట్లు), కరీంనగర్ (రూ. 10.81 కోట్లు) ఉన్నాయి. వాట్సాప్, ఆన్లైన్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పన్ను చెల్లించేందుకు మున్సిపల్శాఖ అవకాశం కల్పించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.