పుణె: ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 24 లక్షలు.. తుది జట్టులోని మిగిలిన పది మందికి రూ. 6 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది.