రామచంద్రాపురం, డిసెంబర్ 15: దేశవ్యాప్తంగా స్మార్ట్హబ్ల ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని బైక్వో సంస్థ కో-ఫౌండర్, సీవోవో విద్యాసాగర్ రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద తన తొలి స్మార్ట్హబ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బైక్లకు క్షణాల్లో చార్జింగ్, బైక్ సర్వీసింగ్లు ఈ స్మార్ట్హబ్ కేంద్రంలో చేయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, దీంతో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.