న్యూఢిల్లీ : భారత్లో న్యూ 2022 మారుతి సుజుకి అల్టో కే10ను మారుతి సుజుకి అధికారికంగా లాంఛ్ చేసింది. రూ 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి న్యూ మారుతి సుజుకి అల్టో కే10 అందుబాటులో ఉంది. 22 ఏండ్ల కిందట అల్టో లాంఛ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ 43 లక్షలకు పైగా కార్లు సేల్ అయి మారుతికి మైల్స్టోన్గా అల్టో నిలిచింది.
న్యూ అల్టో సరికొత్త కే10 ఇంజన్, న్యూ ఎక్స్టీరియర్, న్యూ క్యాబిన్, సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అల్టో ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లతో, పీచర్లతో ఐకానిక్ బ్రాండ్గా నిలిచిందని న్యూ 2022 మారుతి సుజుకి అల్టో కే10 లాంఛ్ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా ఎండీ, సీఈవో హిషషి టెకుచి అన్నారు.
యువ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా న్యూ అల్టో కే10 సరికొత్తగా ముస్తాబైందని చెప్పారు. ఫ్రెష్ న్యూ డిజైన్తో పాటు అడ్వాన్డ్స్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. మునుపెన్నడూ లేని రీతిలో అల్టో యూత్ఫుల్ అప్పీల్తో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.గతంలో ఆఫర్ చేసిన రంగులతో పాటు సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ వంటి మరో మూడు రంగుల్లో న్యూ మారుతి సుజుకి అల్టో కే10 లభిస్తుంది.