తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి భాగస్వామ్యంలో సినిమాల్ని నిర్మించే సంస్కృతి పెరిగింది. తాజాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంస్థతో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ జత కట్టింది. ఈ సంస్థల ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించబోతున్నట్లు నిర్మాతలు సునీల్నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. అభిషేక్ గ్రూప్ చైర్మన్ తేజ్ నారాయణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ ‘కంటెంట్తో పాటు కమర్షియల్ హంగులతో కూడిన పెద్ద సినిమాల్ని కలిసి నిర్మిస్తాం. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తాం. త్వరలో మిగతా వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు.