న్యూఢిల్లీ : సెంట్రల్ ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వంటగ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి మహిళ సహా ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆనంద్ పర్బత్లోని పంజాబీ బస్తీ ప్రాంతం నుంచి అగ్ని ప్రమాదంలో నలుగురు గాయపడ్డట్లు సమాచారం వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే పీసీఆర్ ఆసుప్రతికి తరలించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు. రెండు ఫైర్టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ రబ్బర్ పైప్లో లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయని చెప్పారు.