అల్మాటీ: ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ప్రజలు చేపట్టిన ఆందోళనలతో కజకిస్థాన్ అట్టుడుకుతున్నది. ఇప్పటివరకు హింసాకాండలో దాదాపు 164 మంది మరణించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 5 వేల మందికిపైగా పౌరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. పోలీసులు 125 క్రిమినల్ కేసులను నమోదుచేసినట్టు పేర్కొన్నది.