కొల్లాపూర్, డిసెంబర్ 6: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగవట్నం ఆలయానికి మహర్దశ రానున్నది. రాష్ట్రంలో యదాద్రి తర్వాత సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయం రెండోదిగా ప్రాచుర్యంలో ఉన్నది. సురభి రాజుల కాలం నుంచి చారిత్రక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధుల్లోంచి రూ.15 కోట్లు కేటాయించింది. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.