న్యూఢిల్లీ: ఇప్పటిదాకా విదేశాల్లో విజృంభించిన కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron variant ) ఇప్పుడు మన దేశంలోనూ కలకలం రేపుతున్నది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (LNGP) చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. LNGPలో గురువారం 8 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరగా, ఇవాళ మరో నలుగురు అనుమానితులు చేరినట్లు తెలిసింది. ఇవాళ ఆస్పత్రిలో చేరిన నలుగురిలో ఇద్దరు యూకేకు చెందినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్కు, ఇంకొకరు నెదర్లాండ్స్కు చెందిన వారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బాధితుల శాంపిల్స్ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించినట్లు తెలిసింది.