అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,084 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,328 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 13 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కు చేరింది. ఇప్పటి వరకు 20,23,496 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం వైరస్ బారినపడి 14,613 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్తో చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. తూర్పుగోదావరిలో 244, చిత్తూరులో 147, ప్రకాశంలో 122, నెల్లూరులో 115, కృష్ణాలో 133, గుంటూరులో 111 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు.