హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పెండింగ్ చలాన్ల క్లియరెన్స్కు పోలీసు శాఖ ఇచ్చిన రాయితీని వాహనదారులు సద్వినియోగం చేసుకొంటున్నారు. 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ కాగా, వాటి నుంచి రూ.140 కోట్ల జరిమానా వసూలైంది. రాయితీకి గడువు మరో 15 రోజులే ఉన్నది. గడువులోగా అవకాశాన్ని ఉపయోగించుకోలేనివారు మార్చి 31 తర్వాత మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీ చేసి, చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. చలాన్లను క్లియర్ చేయనివారు ఆన్లైన్, మీసేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లింపులు చేయొచ్చు. ఈ-చలాన్లకు సంబంధించిన వెబ్సైట్ https:// echallan.tspolice.gov.in లింక్ ద్వారా కూడా రాయితీతో జరిమానా కట్టొచ్చు.
పెండింగ్ చలాన్లపై మాఫీ ఇలా .. (ఆప్షనల్)
రెండు, మూడు చక్రాల వాహనాలకు – 75 శాతం మాఫీ
తోపుడు బండ్లకు – 75 శాతం మాఫీ
ఆర్టీసీ డ్రైవర్లకు – 70 శాతం మాఫీ
లైట్, హెవీ మోటర్ వాహనాలకు – 50 శాతం మాఫీ
నో మాస్క్ కేసుల్లో – 90 శాతం మాఫీ