‘సంపన్న కుటుంబానికి చెందిన గౌరి బండ లింగపల్లిలో నివసిస్తూ జర్నలిస్ట్గా పనిచేస్తుంటుంది. డాక్టర్ ఆనంద్ అదే గ్రామంలో ఆసుపత్రి పెట్టాలనుకుంటాడు. వీరిద్దరికి సుబేదార్ రామారావు తోడవుతాడు. తమ సమస్యలు తీరాలంటే అద్భుతం జరగాలనుకుంటారు. అంతలోనే అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం స్కైలాబ్ సాంకేతిక కారణాలతో కూలిపోతుందనే వార్తలొస్తాయి. అది బండలింగపల్లిలోనే పడిపోతుందనే ఊహాగానాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఏ ం జరిగిందో తెలుసుకోవాలంటే ‘స్కైలాబ్’ సినిమా చూడాల్సిందే’ అంటున్నారు విశ్వక్ ఖండేరావు. ఆయన దర్శకత్వంలో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న విడుదలకానుంది. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1979లో నడిచే కథ ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ‘ఇలాంటి కథతో సినిమా చేయడంతో నా కల నెరవేరినైట్లెంది. ఈ చిత్ర నిర్మాణంలో నేనూ భాగమవడం గర్వంగా ఉంది. టీమ్ అంతా ప్రేమించి చేసిన సినిమా ఇది’ అని నిత్యామీనన్ చెప్పింది. ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తానని సత్యదేవ్ పేర్కొన్నారు. విభిన్నమైన కథతో నిర్మాతగా అరంగేట్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని నిర్మాత పృథ్వీ పిన్నమరాజు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, సహనిర్మాత: నిత్యామీనన్, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు.