న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రైద్దెంది. గురుగ్రామ్ వేదికగా ఈనెల 17-20 మధ్య జరుగాల్సిన టోర్నీని కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వాహకులు రద్దు చేశారు. చివరిగా 2019లో జరిగిన ఈ టోర్నీ కరోనా కారణంగా 2020, 21లో నిర్వహించకపోగా.. తాజాగా ఈ ఏడాది కూడా రద్దయ్యింది. క్వారంటైన్ నిబంధనలతో విదేశీ ఆటగాళ్లు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో టోర్నీ రద్దుకు నిర్వాహకులు ఆమోదం తెలిపారు. ‘ఈ టోర్నీ నిర్వహణకు పూర్తి నిబద్ధతతో ఉన్నాం. 2023లో పక్కాగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని భారత గోల్ఫ్ సంఘం తెలిపింది.