అంటాల్య: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ రెండో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో తరుణ్దీప్ రాయ్-రిధి పోర్ జంట పసిడి పతకం కొల్లగొట్టింది. పురుషుల కాంపౌండ్ విభాగంలో అభిషేక్, రజత్, అమన్తో కూడిన భారత జట్టు.. బంగారు పతకం కైవసం చేసుకోగా.. తాజాగా తరుణ్దీప్-రిధి జోడీ.. పతకాల సంఖ్యను డబుల్ చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత ద్వయం.. బ్రిటన్ జంటను చిత్తు చేసింది. 38 ఏండ్ల తరుణ్దీప్ తన గురితో ఆకట్టుకుంటే.. 17 ఏండ్ల వయసులో తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన రిధి ఏమాత్రం బెరుకు లేకుండా బాణాలు సంధించింది.