ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శించారని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. కేంద్ర వైఖరికి నిరసనగా గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ విద్యారంగంపై కేంద్రం శీతకన్ను వేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఫెలోషిప్లు పెంచాలని అన్నారు.
విభజన చట్టంలో స్పష్టంగా ప్రకటించిన గిరిజన యూనివర్సిటీతో పాటు ఇతర విద్యారంగ సంస్థలను నేటికీ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు ఉచితంగా అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, కిరణ్గౌడ్, జంగం అవినాశ్, కోతి విజయ్, నాయకులు పడాల సతీశ్, రఘురాం, వీరబాబు, శ్రీకుమార్, కరుణాకర్రెడ్డి, కృష్ణ, వేల్పుకొండ వెంకట్, సిగ వెంకటేశ్, నవీన్గౌడ్, మంద సురేశ్ తదితరులు పాల్గొన్నారు.