ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్ మాణికేశ్వరీనగర్లో బుధవారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శారీ కట్టే ఫంక్షన్కు హాజరైన ఆమె చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, కార్పొరేటర్ సామల హేమ తదితరులు పాల్గొన్నారు.