న్యూఢిల్లీ: భారత మొట్టమొదటి ‘జాతీయ సముద్రతీర భద్రతా సమన్వయకర్త’ (నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్)గా నేవీ మాజీ వైస్ అడ్మిరల్ జి అశోక్కుమార్ను కేంద్రం నియమించింది. ఈ పోస్టు ఏర్పాటుకు గతేడాదే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఏర్పరచడమే కోఆర్డినేటర్ ప్రధాన విధి.