మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే యాసంగిలో పంటలు సాగు చేయాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే మంచిది. నువ్వులు (శ్వేత తిల్, జేసీఎస్ 1020), కరీంనగర్ మక్కజొన్న (కరీం
నగర్ మక్క, మక్క-1), ఆదిలాబాద్ శెనగలు (ఎన్బీఈజీ-47, ఎన్బీఈజీ-3), రుద్రూర్ కంది (డబ్ల్యూఆర్జీ-65 ), పాలెం హైబ్రిడ్ రకం ఆముదం (పీహెచ్సీ-111), పచ్చజొన్న (పీవైపీఎస్-2), పొద్దుతిరుగుడు, మినుము, పెసర, కుసుమతోపాటు పుచ్చకాయ, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఆలు, పచ్చిమిర్చిలాంటివి సాగు చేయవచ్చు. వీటికి సంబంధించిన నాణ్యత గల విత్తనాలను రాజేంద్రనగర్తోపాటు, వివిధ పరిశోధన కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాం. మీ సమీపంలోని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని, పొలానికి అనువైన పంటలను సాగు చేయాలి. వర్షాకాలం కన్నా యాసంగిలో సాగు ఖర్చు తక్కువగాను, లాభాలు అధికంగానూ ఉంటాయి. మెట్ట పొలాల్లో ఒకే రకమైన పంట వేయకుండా, పంట మార్పిడి చేయాలి. దీనివల్ల నేల సారవంతం కావడంతోపాటు దిగుబడి పెరుగుతుంది. సాగులో ఖర్చుతోపాటు చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది.
డా. జగదీశ్వర్
డైరెక్టర్, ప్రొ.జయశంకర్ తెలంగాణ
వ్యవసాయ విశ్వవిద్యాలయం.