హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులతోపాటు పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి రూ.200 ఆలస్య రుసుముతో గడువును నవంబర్ 25 వరకు పొడిగించినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. వివరాలకు www.braouonline.in లేదా 7382929570, 7382929580 సెల్నంబర్లను సంప్రదించాలని సూచించారు.