దోమ, జూలై 16 : మహిళలు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా పురోగతి సాధించాలని ఎమ్మెల్యే మహేష్రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో దోమ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ను వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసుతో కలిసి ఎమ్మెల్యే మహేష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికోసం తీసుకువస్తున్న ప్రతి పథకాన్ని వినియోగించుకొని మహిళా సాధికారత వైపు అడుగులు వేయాలని సూచించారు. రూ.10 లక్షల వ్యయంతో జిల్లాలోనే తొలి మహిళా సమాఖ్య సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కలెక్టర్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరమ్మను సూపర్ మార్కెట్ ఏర్పాటు వ్యయాలు, నిర్వహణ ఖర్చులు వచ్చే లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం నాచారం గ్రామ సంఘానికి సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ అనిత, రైతుబంధు కోఆర్డినేటర్ లక్ష్మయ్య, కోఆప్షన్ ఖాజాపాషా, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, పీడీ కృష్ణన్, ఎంపీడీవో జయరాం, ఏపీఎం సాయన్న, ఏపీవో వెంకటేశ్, మహిళా సంఘాల సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.