హైదరాబాద్, మార్చి 12 ఖలీల్వాడి: నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదివారం కవిత పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం నిజామాబాద్లో 18 వేల నాణేలతో 12 అడుగుల కవిత చిత్రపటాన్ని రూపొందించారు. హైదరాబాద్కు చెందిన రంగోలీ చిత్రకారుడు విజయ్భాస్కర్ బృందం 15 గంటలు శ్రమించి 18 వేల నాణేలతో కవిత చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి , భూమారెడ్డి కేక్ కట్ చేశారు.
పుట్టినరోజు పాట సీడీ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ రచించి, రూపొందించిన పాట సీడీని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్అలీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ కవిత స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా పొతంగల్లో నాలుగు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.