రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని దివ్యసాకేతం ఆశ్రమ ప్రాంగణంలో బృహత్ రామానుజ పంచలోహ విగ్రహం ప్రారంభానికి ముస్తాబవుతోంది. త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్.. దివ్యసాకేతం ఆశ్రమానికి వెళ్లి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆశ్రమంలోని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్ స్వామి శాలువాలతో సత్కరించి మంగళాశాసనాలు అందించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న 108 దివ్యదేశాలు.. ఇతర బృహత్తర నిర్మాణాల గురించి వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు.. ప్రధాని, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన విషయాలను కేసీఆర్తో పంచుకొన్నారు.