పర్యాటకులు, నగరవాసులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. తాము తాగిన వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన చేసింది. వాటర్ బాటిల్ డిజైన్లో ఉండే భారీ డస్ట్ బిన్ను ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిర్దేశిత ప్రాంతంలో వేసేలా పర్యాటకులను చైతన్య పరచాలన్నా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ వినూత్న ఏర్పాటు చేశారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ డస్ట్బిన్ ఇప్పుడు పర్యాటకులు, నగవాసులను ఆకట్టుకుంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా