heavy rains in chennai | తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు చెన్నై మహానగరాన్ని ముంచెత్తాయి. వరదల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వరదల కారణంగా కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి కూడా నీటమునిగింది. ఎయిర్పోర్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇండ్లలోకి నీరు వచ్చి చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. భాధితులకు అందుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు.