కేంద్రానికి ప్రతిపాదించిన సంస్థ
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా జైకోవ్-డీ ధరను రూ.1900గా జైడస్ క్యాడిలా సంస్థ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే, ధర తగ్గింపుపై కేంద్రం సంస్థతో చర్చలు జరుపుతున్నది. టీకా ధర ఎంతనేది ఈ వారంలో నిర్ణయం కానున్నది. జైకోవ్-డీ మూడు డోసుల టీకా. 12 ఏండ్లు పైబడినవారికి ఇస్తారు. ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా టీకా ఇది. సూది లేకుండా జెట్ ఇంజక్టర్ అనే పరికరం సాయంతో దీనిని వేస్తారు. మొదటి డోసు వేసుకొన్న 28 రోజులకు రెండో డోసు, 56 రోజులకు మూడో డోసు వేసుకోవాలి. అత్యవసర వినియోగం కింద జైకోవ్-డీకి డీసీజీఐ ఇప్పటికే అనుమతినిచ్చింది.