న్యూఢిల్లీ: జైడస్ క్యాడిల్లా ( Zydus ) కంపెనీకి చెందిన జైకోవ్-డి వ్యాక్సిన్కు శుక్రవారమే ప్రభుత్వ అనుమతి దక్కిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ నుంచి ప్రతి నెలా ఆ కంపెనీ కోటి డోసులను ఉత్పత్తి చేయనున్నది. జైడస్ కోవిడ్ టీకాలను 12 ఏళ్ల చిన్నారులకు కూడా ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరి నాటికి.. మూడు నుంచి అయిదు కోట్ల కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు జైడస్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు జైడిస్ కంపెనీ థార్డ్ పార్టీ కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు కూడా జైడిస్ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్తో కలిసి జైడస్ కంపెనీ మూడు డోసుల వ్యాక్సిన్ను డెవలప్ చేసింది. భారత్ స్వయంగా ఉత్పత్తి చేసిన రెండవ కోవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. దేశంలో దీంతో ఆరు వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ వినియోగ అనుమతి దక్కింది. డెల్టా వేరియంట్పై కూడా తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని జూలైలో జైడస్ కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే.