న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్-డీ కొవిడ్ టీకాకు సంబంధించిన ధరపై నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నిరంతర చర్చల నేపథ్యంలో కంపెనీ వ్యాక్సిన్ డోస్ ధరను రూ.265గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరుగలేదని సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. సూది అవసరం లేకుండా టీకాను రూపొందించిన విషయం తెలిసిందే.
అయితే, వ్యాక్సిన్ వేసేందుకు రూ.93 ఖరీదు చేసే డిస్పోజబుల్ పెయిన్లెస్ జెట్ అప్లికేటర్ అవసరం. రెండింటి ధర కలిపి డోసుకు మొత్తం డోసుకు రూ.358కి చేరనుంది. అహ్మదాబాద్కు చెందిన ఈ ఫార్మా కంపెనీ ఇంతకు ముందు మూడో డోసులకు రూ.1,900 ధరను ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం వరుసగా కంపెనీతో చర్చలు జరిపిన అనంతరం ధరను.. రూ.358కు తగ్గించింది.
ఈ విషయంపై ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. జైకోవ్-డీ మూడు డోసుల టీకా.. ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారిత, సూది రహిత తొలి కొవిడ్ టీకా. వ్యాక్సిన్కు ఆగస్ట్ 20న డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. 12 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఇవ్వనుండగా.. భారత్లో 12-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా నిలిచింది.
ఇదిలా ఉండగా.. ఈ వ్యాక్సిన్ను దేశంలో కొనసాగుతున్న టీకా డ్రైవ్లో చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందుకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) పోట్రోకాల్ను సిద్ధం చేస్తున్నది. ప్రస్తుత భారత్లో కొవిడ్ టీకా డ్రైవ్లో భారత్ బయోటెక్ కొవాగ్జిన్, సీరం కంపెనీకి చెందిన కొవిషీల్డ్ను వినియోగిస్తున్నారు.