న్యూఢిల్లీ, జూలై 2: ప్రముఖ జర్నలిస్టు, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని ఓ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే కోర్టు ఇచ్చిన ఐదు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. నిందితుడిని మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలన్న ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ‘ఆల్ట్ న్యూస్’ మాతృ సంస్థ ప్రవడా మీడియాకు పాక్, సిరియా, గల్ఫ్ దేశాల నుంచి విరాళాలొచ్చాయని, ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 2018లో హిందూ దేవతలపై ట్విట్టర్లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన కేసులో జుబైర్ అరెస్టయిన విషయం తెలిసిందే.