తిరువనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురంలో జూ పార్కులో విషాదం నెలకొంది. ఆర్షద్ (45) అనే వ్యక్తి జూ కీపర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం నాగుపాము ఉన్న కేజ్ను శుభ్రం చేస్తుండగా.. ఆ పాము ఆర్షద్ను కాటేసింది. దీంతో అతన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఆర్షద్ మృతి పట్ల కేరళ మంత్రి రాణి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్షద్ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామన్నారు.