లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జికా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. శుక్రవారం కొత్తగా 30 కేసులు నమోదయ్యాయి. దీంతో కాన్పూర్ జిల్లాలో జికా పాజిటివ్ కేసుల సంఖ్య 66కు పెరిగింది. ఇప్పటి వరకు 45 మంది మగవారు, 21 మంది మహిళలకు జికా వైరస్ సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.
అక్టోబరు 23న కాన్పూర్లో భారత వైమానిక దళం (IAF) వారెంట్ అధికారిని పరీక్షించడంతో జికా సంక్రమణకు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎయిర్ స్టేషన్ పరిసర ప్రాంతాల వారి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్లో పరీక్షిస్తున్నారు.
దీంతో కాన్పూర్లో జికా వైరస్ కేసుల నమోదు పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.