న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్19పై చర్చ మొదలైన సమయంలో ఆ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. ఏపీ స్పెషల్ స్టాటస్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక వైపు కోవిడ్పై చర్చ జరుగుతుండగా.. వెల్లోనే ఉన్న వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఉండిపోయారు. రాజ్యసభ సభాపతి పీయూష్ గోయల్ కూడా వైసీపీ సభ్యుల్ని సీట్ల వద్దకు వెళ్లమని కోరారు. కానీ ఎంపీ విజయ సాయి రెడ్డి మాత్రం వెనక్కి వెళ్లలేదు. ఏపీ ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం చేపట్టాలని ఎంపీ విజయసాయి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టే వరకు వెనక్కి వెళ్లమని ఎంపీ విజయ సాయి అన్నారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ .. సభను కొద్దిసేపు వాయిదా వేశారు.