లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి, సీఎం యోగి ఆదిత్యనాథ్ గెటప్ వేశాడు. ఆ వేషధారణలో సెక్టార్ 11లోని పోలింగ్ బూత్కు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఓటర్లతోపాటు అక్కడున్న పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. రాజు కోహ్లీని నేరుగా పోలింగ్ బూత్లోకి పోలీసులు అనుమతించారు. ఓ వైపు చాలా మంది ప్రజలు క్యూలైన్లలో వేచి ఉండగా, సీఎం యోగి వేషధారణలో ఉన్న అతడు మాత్రం ఎంచక్కా దర్జాగా లోపలికి వెళ్లి ఓటు వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్నది. తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభంకాగా, చివరి దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. ఈసారి యూపీలో ప్రధానంగా నాలుగు పార్టీలు పోటీ పడుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని అధికార బీజేపీ, అఖిలేష్-జయంత్ చౌదరి నేతృత్వంలోని ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతోపాటు ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.
#WATCH | Raju Kohli, a youth dressed as CM Yogi Adityanath arrived at a polling booth in Sector 11 of Noida to cast his vote for #UttarPradeshElections2022 pic.twitter.com/3o5gTH6b3q
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022