లక్నో, జనవరి 18: కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిని కిడ్నాప్ చేయడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. మంత్రి డ్రైవర్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ నిరంజన్ కథనం ప్రకారం మంగళవారం ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న మంత్రిని ఎయిర్పోర్టు నుంచి తీసుకురావడానికి నిరంజన్ కారులో బయలుదేరాడు.
ఒక చోట టీ తాగడానికి కారు ఆపగా ఓ యువకుడు కారులోని అంగరక్షకుడిని తోసేసి కారుతో పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే మిగతా భద్రతా సిబ్బంది అడ్డగించి అతడిని పోలీసులకు అప్పగించారు.