UP CM Yogi Adityanath | వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివిధ కోర్సుల్లో ఫైనలియర్ విద్యార్థులకు ల్యాప్టాప్లు, టాబ్లు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని వాజపేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న లక్నోలో తొలి దశలో లక్ష మందికి ల్యాప్టాప్లు, ట్యాబ్లు పంపిణీ చేస్తామని ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ 60 వేల ల్యాప్టాప్లు, 40 వేల ట్యాబ్లు పంపిణీ చేస్తారని తెలిపారు. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్, బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల్లో ఫైనలియర్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్కు ల్యాప్టాప్లు ఎలా వాడాలో తెలియదని ఎసపీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర యువతకు ల్యాప్టాప్లు కూడా ఇవ్వలేదని ఇటీవల రాయబరేలీలో జరిగిన సభలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ల్యాప్టాప్లే ఇప్పటికీ పని చేస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విద్యార్థులకు కోటి ల్యాప్టాప్లు, ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించడం ఆసక్తికరం. తొలి లక్ష ల్యాప్టాప్లు, ట్యాబ్ల పంపిణీకి రూ.2035 కోట్లు ఖర్చవుతుందని యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్ వినీత్ చెప్పారు.