Bluesky | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పుట్టుకొచ్చింది. ‘బ్లూస్కై’ పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఈ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు. అకౌంట్ పోర్టబిలిటీ లాంటి వినూత్న ఫీచర్లను ఆఫర్ చేస్తున్న ‘బ్లూస్కై’ ఒక రకంగా ఎక్స్కు ప్రతిరూపమే.
దాదాపు ఎక్స్ మాదిరిగానే పనిచేసే ‘బ్లూస్కై’కి సొంత ప్రత్యేకత ఉన్నది. ‘లేబులింగ్ సర్వీస్’ లాంటి ఫీచర్ను ప్రవేశపెట్టాలని ఈ ప్లాట్ఫామ్ యోచిస్తున్నది. కంటెంట్ను మోడరేట్ చేసేందుకు కస్టమర్లు, సంస్థలు లేబుల్స్ను రూపొందించుకునేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.