న్యూఢిల్లీ, జూన్ 25: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై తాము చేస్తున్న పోరాటాన్ని ఇకపై న్యాయస్థానంలోనే కొనసాగిస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించారు. తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై చర్య తీసుకోవాలంటూ ఐదు నెలలుగా చేస్తున్న వీధి పోరాటానికి స్వస్తి పలుకుతున్నట్టు ఆదివారం తెలిపారు. బ్రిజ్ భూషణ్పై పోలీసులు ఈ నెలలో కేసు దాఖలు చేసినందున తాము ఇన్నాళ్లూ నిర్వహించిన ‘మీ టూ’ ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 155 మంది సాక్షులను ప్రశ్నించారు.