న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై (wrestlers) లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజ్లర్లు తమ ఆందోళనను ఉధృతం చేశారు. నూతన పార్లమెంట్ భవనం వద్ద మహిళా సమ్మాన్ మహాపంచాయత్ నిర్వహించేందుకు బయలుదేరిన రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నరోజే మహిళా రెజ్లర్లు పార్లమెంట్ భవనం వరకూ ప్రదర్శనకు పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. బారికేడ్లను దాటుకుని నూతన పార్లమెంట్ భవనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు. మహిళా రెజ్లర్ల ఆందోళనకు రైతులు, పలు రాష్ట్రాల ఖాప్ పంచాయత్లు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్ భవనం వరకూ ప్రదర్శన చేపట్టేందుకు బయలుదేరిన భజరంగ్ పూనియానూ అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Mahapanchayat will certainly be held today. We’re fighting for our self-respect.They’re inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV
— ANI (@ANI) May 28, 2023
నూతన పార్లమెంట్ భవనం వరకూ తాము శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామని రెజ్లర్లు చెబుతున్నా వినిపించుకోని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ భవనం వైపు వెళ్లేందుకు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించారు. మహా పంచాయత్ను తాము నిర్వహించి తీరుతామని, నూతన పార్లమెంట్ భవనాన్ని పాలకులు ప్రారంభిస్తున్న వేళ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని రెజ్లర్ భజరంగ్ పూనియ ఆందోళన వ్యక్తం చేశారు.
Read More
Parliament Building | రాష్ట్రపతి లేకుండానే నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ