న్యూఢిల్లీ/రోహ్తక్, మే 21: 15 రోజుల్లోగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలన్న కాప్ పంచాయత్ డిమాండ్ గడువు ఆదివారంతో ముగిసింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడంపై నేతలు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం వద్ద ‘మహిళా మహాపంచాయత్’ నిర్వహించాలని హార్యానాలోని రోహ్తక్ జిల్లా మహమ్ పట్టణంలో ఆదివారం జరిగిన కాప్ పంచాయత్లో నేతలు నిర్ణయం తీసుకొన్నారు. ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ ప్రారంభించే రోజునే ఈ ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.