న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, ఏడుగురు మహిళా రెజ్లర్లు సహా తాను కూడా నార్కో పరీక్షలకు సిద్ధమని రెజ్లర్ బజరంగ్ పునియా సోమవారం ప్రకటించారు. బ్రిజ్ భూషణ్కు నార్కో పరీక్షలు జరపాలని మహిళా రెజ్లర్లు తొలుత డిమాండ్ చేశారు.
దీనిపై బ్రిజ్ భూషణ్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లకూ నార్కో పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు వారు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు.