న్యూఢిల్లీ: పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బీజూ జనతాదళ్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీ సస్మిత్ పాత్ర మహిళా రిజర్వేషన్ అంశాన్ని బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. ‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఎంతోకాలంగా పెండింగ్లో ఉండిపోయింది. బిల్లుకు చట్టబద్ధత తీసుకురావటంలో మోదీ సర్కార్ విఫలమైంది’ అని అన్నారు.