ముంబై : ఓ మహిళ రన్నింగ్ ట్రైన్ను ఎక్కబోతుండగా.. ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ ఘటన ముంబైలోని వాసయి రోడ్డు రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఓ రైలు నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఈ సమయంలో ఇద్దరు మహిళలు రైలును ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఒక మహిళ రైలు ఎక్కబోతుండగా జారి పడిపోయింది. వెనుకాలే వెళ్తున్న మరో వ్యక్తి అప్రమత్తమై.. ఆమెను ప్లాట్ఫాం పైకి లాగేందుకు ప్రయత్నించాడు. మరికొందరు వచ్చి ఆమెను సురక్షితంగా బయటకు లాగారు.